ePaper
Monday, August 10, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రతి శిశువుకు తొలి ఆరు నెలలు తల్లిపాలే సంపూర్ణ ఆహారం

ప్రతి శిశువుకు తొలి ఆరు నెలలు తల్లిపాలే సంపూర్ణ ఆహారం

📰 Generate e-Paper Clip

ప్రతి శిశువుకు తొలి ఆరు నెలలు తల్లిపాలే సంపూర్ణ ఆహారం

➤ కుత్బుల్లాపూర్‌లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ

➤ గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన

➤ శ్రీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి సామాజిక వేడుకల నిర్వహణ

➤ పుట్టిన వెంటనే ముర్రుపాలు తప్పనిసరిగా ఇవ్వాలని నిపుణుల సూచన

➤ ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే… ఏడో నెల నుంచి అదనపు ఆహారం

➤ తల్లిపాల ప్రాధాన్యాన్ని ప్రతి ఇంటికీ చేర్చాలని అధికారుల పిలుపు

 

కుత్బుల్లాపూర్, ఆగస్టు 6 ( నమస్తే భరత్ ): ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ ప్రాజెక్ట్ పరిధిలోని మహిళా ప్రాంగణం, కుకట్‌పల్లిలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, ఏడు నెలల చిన్నారులకు అన్నప్రాసన, మూడేళ్ల పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించి భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలను ప్రతిబింబించే సామాజిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం తల్లిపాల ప్రాముఖ్యత, వాటి వల్ల తల్లి, శిశువుకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై వైద్య, ఐసీడీఎస్ అధికారులు సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ, ప్రతి తల్లి తన బిడ్డకు తొలి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. తల్లిపాలపై సమాజంలో మరింత అవగాహన కల్పించడం ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బంది బాధ్యత అని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, పుట్టిన వెంటనే ముర్రుపాలు (కోలస్ట్రం) తప్పనిసరిగా ఇవ్వాలని, అవే శిశువుకు తొలి రక్షణ కవచమని చెప్పారు. తల్లిపాల వల్ల శిశువులో వ్యాధి నిరోధక శక్తి, మేధాశక్తి పెరగడంతో పాటు తల్లి–బిడ్డల మధ్య ఆత్మీయ బంధం మరింత బలపడుతుందని వివరించారు. ఆరు నెలల అనంతరం ఏడో నెల నుంచి మాత్రమే అదనపు ఆహారం ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి, కుకట్‌పల్లి డీఎం, కుత్బుల్లాపూర్ సీడీపీఓ, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళా, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి తల్లి తన బిడ్డకు తల్లిపాలు అందించేలా సమాజంలో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!