ePaper
Wednesday, September 16, 2026
ePaper
Homeఎడిటోరియల్సమ్మిగౌడ్ చేతుల మీదుగా నూతన దుకాణం ప్రారంభం

సమ్మిగౌడ్ చేతుల మీదుగా నూతన దుకాణం ప్రారంభం

📰 Generate e-Paper Clip

సమ్మిగౌడ్ చేతుల మీదుగా నూతన దుకాణం ప్రారంభం

నమస్తే భారత్ :-కేసముద్రం

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో డింపుల్ కిరాణా & ఫ్యాన్సీ జనరల్ స్టోర్.ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి షాపు యజమాని కొమ్మడబోయిన రంజిత్‌కు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో వ్యాపార సంస్థలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.నూతనంగా ప్రారంభించిన ఈ వ్యాపారం దిగ్విజయంగా సాగి, యజమానికి మంచి లాభాలు తేవాలని మరియు గ్రామస్తులకు నాణ్యమైన సేవలు అందించాలని పలువురు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యాపార నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఏర్పుల సునీత కుమారస్వామి, ​తండ సంపత్, ​జెనిగల అనిల్,​జీజుల వరలక్ష్మీ సందీప్, ​సోమ మోహన్, ​అల్లి రమేష్, ​నల్లగొండ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!