సమ్మిగౌడ్ చేతుల మీదుగా నూతన దుకాణం ప్రారంభం

నమస్తే భారత్ :-కేసముద్రం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో డింపుల్ కిరాణా & ఫ్యాన్సీ జనరల్ స్టోర్.ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి షాపు యజమాని కొమ్మడబోయిన రంజిత్కు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో వ్యాపార సంస్థలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.నూతనంగా ప్రారంభించిన ఈ వ్యాపారం దిగ్విజయంగా సాగి, యజమానికి మంచి లాభాలు తేవాలని మరియు గ్రామస్తులకు నాణ్యమైన సేవలు అందించాలని పలువురు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యాపార నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఏర్పుల సునీత కుమారస్వామి, తండ సంపత్, జెనిగల అనిల్,జీజుల వరలక్ష్మీ సందీప్, సోమ మోహన్, అల్లి రమేష్, నల్లగొండ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.



