నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
సంజీవయ్య నగర్ బోనాల వేడుకల్లో ప్రత్యేక పూజలు
కుత్బుల్లాపూర్, ఆగస్టు 7 ( నమస్తే భారతి ): సంజీవయ్య నగర్లోని శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యాదగిరి, జె. విజయ్ గుప్త, పెంటని ఉమామహేశ్వర్, జూలూరి వీరేందర్ గుప్త, దాస్, కనకయ్య, కృష్ణచారి, గంగాధర్, విజయ్, శ్రీధర్, దుర్గాపతి, రాజుతో పాటు నియోజకవర్గ యువజన అధ్యక్షుడు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, రాకేష్ జాలిగం, అజయ్, సిద్దులు, నసీరుద్దీన్, నగేష్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.



