ePaper
Saturday, August 1, 2026
ePaper
Homeఎడిటోరియల్లక్ష్మీనగర్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీకి కొలన్ హన్మంత్ రెడ్డి శుభాకాంక్షలు

లక్ష్మీనగర్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీకి కొలన్ హన్మంత్ రెడ్డి శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

లక్ష్మీనగర్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీకి కొలన్ హన్మంత్ రెడ్డి శుభాకాంక్షలు


➤ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ కార్యాలయంలో మర్యాదపూర్వక భేటీ

➤ నూతన కమిటీ సభ్యులకు శాలువాతో ఘన సత్కారం

➤ కాలనీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపు

➤ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచన

➤ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా సేవలందించాలని ఆకాంక్ష

➤ పలువురు నాయకులు, కాలనీ వాసుల సమక్షంలో ఆత్మీయ సమావేశం

 

బాచుపల్లి, జూలై 31 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం లక్ష్మీనగర్ ఓనర్స్ అసోసియేషన్‌కు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు అమృత్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శంకర్ రావు, ట్రెజరర్ సాయి ప్రేమ్ శుక్రవారం బాచుపల్లిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి నూతన కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారంలో నూతన కమిటీ సమిష్టిగా కృషి చేసి ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజా సేవే ప్రధాన లక్ష్యంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పాల కృష్ణ, మైసిగారి శ్రీనివాస్‌తో పాటు కాలనీ వాసులు యూ. ప్రభులింగం, ఈ. సురేష్, బి. శ్రీనివాస్, నవీన్, కామేశ్వరరావు, ప్రసాద్ రెడ్డి, రాధిక, త్రివేణి తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాలనీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!