ePaper
Sunday, August 16, 2026
ePaper
Homeఎడిటోరియల్సోసైటీ వద్ధ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సోసైటీ వద్ధ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

సోసైటీ వద్ధ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఖానాపురం ఆగష్టు 15( నమస్తే భారత్ ) :

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖానాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఖానాపురం సోసైటీ చైర్మన్ వల్లే శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధి కోసం సోసైటీ పాలకవర్గం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని చైర్మన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ వైస్ ఛైర్మన్ శాఖమూరి హరిబాబు, సీఈఓ ఆంజనేయులు , పాలకవర్గ సభ్యులు బండి వెంకన్న శివరాత్రి వెంకన్న భాషబోయిన రవి మర్రి ప్రభాకర్ దేవినేని వేణుగోపాల్ రావు బొబ్బ విద్యాసాగర్ రావు జట్టంగి నాగరాజు ఎర్ర రజిత బాలుగు లక్ష్మణ్ నునవత్ బిచ్య నాయక్ సిబ్బంది, రైతులు, సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!