కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు ఊతం

శంభీపూర్ కార్యాలయంలో మొక్కలు నాటిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
-గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు పిలుపు
-కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు
-ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచన
-పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించిన కార్యక్రమం
-పచ్చదన పరిరక్షణే భావితరాలకు గొప్ప కానుక అని వ్యాఖ్య
– కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు
దుండిగల్, జూలై 24 ( నమస్తే భారత్ ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంభీపూర్లోని పార్టీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మాట్లాడుతూ, కేటీఆర్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడంలో విశేష ఫలితాలను సాధించిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవలో ఆయన మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొని మొక్కలు నాటడంతో పాటు కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేశారు.



