మెకానిక్ బానోత్ కోట్య పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ నివాళి
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎలమంచిలి తండా గ్రామపంచాయతీకి చెందిన మెకానిక్ బానోత్ కోట్య మృతిపై డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మండల టిఆర్ఎస్ నాయకులు లాల్ సింగ్ నాయక్, ఎలమంచిలి తండా సర్పంచ్ భద్రు నాయక్, మాజీ సర్పంచ్ మంగీలాల్ నాయక్, రాములు నాయక్, రెడ్డి నాయక్, ప్రియ శేఖర్ తదితరులు పాల్గొన్నారు



