మరిపెడ మున్సిపాలిటీ సాధారణ సమావేశానికి
ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ సాధారణ సమావేశానికి ప్రభుత్వ విప్ మరియు డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, అభివృద్ధి పనుల పురోగతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విశారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి వార్డు కౌన్సిలర్లు మరియు మున్సిపల్ అధికారులు.తదితరులు పాల్గొన్నారు



