ePaper
Sunday, August 16, 2026
ePaper
Homeఎడిటోరియల్పద్మనగర్‌లో సమస్యలపై సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆరా?

పద్మనగర్‌లో సమస్యలపై సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆరా?

📰 Generate e-Paper Clip

పద్మనగర్‌లో సమస్యలపై సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆరా?

➜ ప్రజల వద్దకే అధికారులు.. వినతుల స్వీకరణ

➜ తాగునీరు, మురుగు పారుదలపై ప్రత్యేక దృష్టి

➜ సిమెంట్‌ రోడ్లు, పార్కుల అభివృద్ధికి వినతులు

➜ వీధిదీపాలు, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటుకు డిమాండ్‌

➜ వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంతల నిర్మాణం

➜ దోమల నియంత్రణకు విస్తృతంగా నివారణ చర్యలు

జీడిమెట్ల, ఆగస్టు 14: ( నమస్తే భారత్ ); ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని పరిష్కరించేందుకు చేపట్టిన ‘ఒక వార్డు–ప్రతిరోజు’ కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ డాక్టర్‌ జి. సృజన, కుత్బుల్లాపూర్‌ జోనల్‌ కమిషనర్‌ పింకేష్‌ కుమార్‌తో కలిసి శుక్రవారం జీడిమెట్ల సర్కిల్‌ పరిధిలోని పద్మనగర్‌ వార్డులో పర్యటించారు. పద్మనగర్‌ రింగ్‌రోడ్డులో స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో సమావేశమై ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

మౌలిక వసతులపై వినతులు

పద్మనగర్‌లో తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను పటిష్టం చేయాలని స్థానికులు కోరారు. అవసరమైన ప్రాంతాల్లో సిమెంట్‌ రోడ్లు నిర్మించాలని, పార్కులను ఆధునీకరించి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మరమ్మతులకు గురైన వీధిదీపాలను వెంటనే బాగుచేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేయాలని కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు కోరారు.

ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి

వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా భూగర్భ జలాలను పెంచేందుకు అవసరమైన ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలని స్థానికులు సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టి కాలనీల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

దోమల బెడద నివారించాలి

వర్షాకాలం నేపథ్యంలో దోమల బెడద పెరగకుండా పొగమందు పిచికారీ, దోమల లార్వా నివారణ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ప్రజలు కోరారు. నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

సమస్యల పరిష్కారానికి హామీ

ప్రజలు సమర్పించిన వినతులపై కమిషనర్‌ డాక్టర్‌ జి. సృజన సానుకూలంగా స్పందించారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు త్వరితగతిన చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించడమే ‘ఒక వార్డు–ప్రతిరోజు’ కార్యక్రమం ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో జీడిమెట్ల సర్కిల్‌ ఉప కమిషనర్‌ డి. శంకర్‌ సింగ్‌, సహాయ వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ కవిత, సహాయ పోలీసు కమిషనర్‌ ఐ. రాణి, ఉప కార్యనిర్వహణ ఇంజినీర్లు దుర్గాప్రసాద్‌, శివప్రకాష్‌, లావణ్య, సహాయ ఇంజినీర్‌ లిఖిత సేన్‌, హైదరాబాద్‌ మహానగర నీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి ఉప ప్రధాన నిర్వాహణాధికారి ప్రసాద్‌రావుతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!