మహాదేవపురంలో రూ.1.08 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
➤ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం
➤ సీఎంసీ స్పెషల్ ఫండ్ ద్వారా రూ.40 లక్షలు, రూ.68 లక్షల నిధుల మంజూరు
➤ ఏ, డీ, ఎం, డబ్ల్యూ, ఎక్స్ బ్లాక్లతో పాటు ఫేజ్–2లో అభివృద్ధి పనులు
➤ నాణ్యమైన మౌలిక సదుపాయాలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : కొలన్ హన్మంత్ రెడ్డి
➤ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామన్న కాంగ్రెస్ ఇంచార్జ్
➤ నిధుల మంజూరుకు హన్మంత్ రెడ్డికి కాలనీవాసులు, వెల్ఫేర్ సొసైటీ సభ్యుల కృతజ్ఞతలు
కుత్బుల్లాపూర్, జూలై 30 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 277వ డివిజన్ మహాదేవపురం కాలనీలో రూ.1.08 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు గురువారం ఘనంగా శ్రీకారం చుట్టారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సీఎంసీ స్పెషల్ ఫండ్ ద్వారా రూ.40 లక్షలు, రూ.68 లక్షలు కలిపి మొత్తం రూ.1.08 కోట్ల నిధులు మంజూరుకాగా, ఈ నిధులతో మహాదేవపురం కాలనీలోని ఏ, డీ, ఎం, డబ్ల్యూ, ఎక్స్ బ్లాక్లతో పాటు ఫేజ్–2 పరిధిలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీల సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన రహదారుల నిర్మాణం, ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ, ప్రతి కాలనీ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. మహాదేవపురం కాలనీ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుని సీసీ రోడ్ల నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేయించడంపై కాలనీవాసులు, మహాదేవపురం కాలనీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కొలన్ హన్మంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 277వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధనోళ్ల సంజీవ్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అంజలి యాదవ్, మహాదేవపురం కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు కే. వెంకటరెడ్డి, ప్రసాద్, రాంచందర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ప్రవీణ్, వెంకట్ రెడ్డి, కృష్ణ రెడ్డి, దిలీప్, రాజమహేంద్ర, మల్లారెడ్డి, జాంగా రెడ్డి, శివ రెడ్డి, రాంచందర్ (ఎస్ఐ), సంతోష్, రంజిత్, వెంకటేష్, సురేష్, చావా శ్రీనివాస్, వీరయ్య, ప్రభాకర్, అనిల్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, ప్రశాంతి, చర్చి పాస్టర్లు, కాలనీవాసులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



