ePaper
Sunday, July 12, 2026
ePaper
Homeఎడిటోరియల్విధుల్లో క్రమశిక్షణ.. సేవలో మానవత్వం

విధుల్లో క్రమశిక్షణ.. సేవలో మానవత్వం

📰 Generate e-Paper Clip

విధుల్లో క్రమశిక్షణ.. సేవలో మానవత్వం

-సైబర్ భద్రతకు సాంకేతికతను ఆయుధంగా మలిచిన జీడిమెట్ల ఎస్‌హెచ్‌వో గడ్డం మల్లేష్

-‘క్రైమ్ ఫ్రీ ఇండియా’ యూట్యూబ్ వేదికగా లక్షల మందికి సైబర్ అవగాహన

-లా అండ్ ఆర్డర్ నుంచి సైబర్ క్రైమ్ వరకు 13 ఏళ్లకు పైగా విశిష్ట సేవలు

-120కిపైగా ప్రశంసాపత్రాలు, జాతీయ స్థాయిలో ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు

-150కుపైగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు నేర నివారణపై చైతన్యం

-కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం.. ప్రజలతో మమేకమై సేవలు

-‘భద్రమైన సమాజమే లక్ష్యం’ అనే సంకల్పంతో ముందుకు సాగుతున్న పోలీసు అధికారి

కుత్బుల్లాపూర్, జూలై 11 ( నమస్తే భరత్ ఖాకీ యూనిఫాం ధరించడం ఒక బాధ్యత అయితే.. ఆ బాధ్యతను ప్రజా సేవగా మలచడం ఒక నిబద్ధత. అలాంటి నిబద్ధతతో పోలీసు విధులను నిర్వర్తిస్తూ, సాంకేతికతను ప్రజా ప్రయోజనాలకు వినియోగిస్తూ సైబర్ నేరాల నివారణలో విశేష కృషి చేస్తున్న అధికారి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) గడ్డం మల్లేష్. విధుల్లో క్రమశిక్షణ, ప్రజలతో సాన్నిహిత్యం, నేరాల నియంత్రణలో సమర్థత, అవగాహన కార్యక్రమాల్లో చురుకుదనం వంటి లక్షణాలతో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. 2009 బ్యాచ్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పోలీసు శాఖలో చేరిన గడ్డం మల్లేష్, హైదరాబాద్ నగర పోలీసు పరిధిలో లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ), సైబర్ క్రైమ్ వంటి కీలక విభాగాల్లో సేవలందించారు. నేర పరిశోధన, ఇంటెలిజెన్స్ సేకరణ, సైబర్ మోసాల దర్యాప్తులో విశేష అనుభవాన్ని సంపాదించారు. 2023లో ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొంది మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా సేవలందించిన అనంతరం ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లో సైబర్ భద్రతపై చైతన్యం కల్పించాలనే లక్ష్యంతో ఆయన ప్రారంభించిన ‘క్రైమ్ ఫ్రీ ఇండియా’ యూట్యూబ్ ఛానల్ విశేష ఆదరణ పొందింది. సైబర్ మోసాలు, డిజిటల్ భద్రత, చట్టపరమైన అవగాహన, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు వంటి అంశాలపై సులభమైన భాషలో వీడియోలు రూపొందిస్తూ ప్రజలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ ఛానల్‌కు లక్ష మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉండటం విశేషం. విధుల్లో చూపుతున్న ప్రతిభకు గుర్తింపుగా ఆయనకు 120కిపైగా ప్రశంసాపత్రాలు, పురస్కారాలు లభించాయి. వినూత్న పోలీసింగ్ సేవలకు గాను దేశంలోని ప్రతిష్ఠాత్మక ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు కూడా అందుకున్నారు. ఇది ఆయన సేవలకు లభించిన జాతీయ స్థాయి గుర్తింపుగా నిలిచింది. పోలీసింగ్ అంటే కేవలం నేరస్థులను పట్టుకోవడమే కాదని, నేరాలు జరగకుండా సమాజాన్ని చైతన్యపరచడమే అసలైన పోలీసింగ్ అనే భావనతో గడ్డం మల్లేష్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 150కుపైగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళల భద్రత, రోడ్డు భద్రత, బాధ్యతాయుత పౌరసత్వం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా భద్రతకు ప్రాధాన్యం, సేవా దృక్పథం, సాంకేతికత వినియోగం, కమ్యూనిటీ పోలీసింగ్‌పై నమ్మకంతో పనిచేస్తున్న గడ్డం మల్లేష్ సేవలు పోలీసు శాఖకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. నేర రహిత సమాజ నిర్మాణమే తన లక్ష్యమని భావిస్తూ ఆయన కొనసాగిస్తున్న కృషి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!