ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeఎడిటోరియల్ఐకమత్యానికి ప్రతీకగా కొమ్ము మరియు అనుబంధ కుటుంబాల సంక్షేమ సంఘం తొలి ఆత్మీయ సమ్మేళనం

ఐకమత్యానికి ప్రతీకగా కొమ్ము మరియు అనుబంధ కుటుంబాల సంక్షేమ సంఘం తొలి ఆత్మీయ సమ్మేళనం

📰 Generate e-Paper Clip

ఐకమత్యానికి ప్రతీకగా కొమ్ము మరియు అనుబంధ కుటుంబాల సంక్షేమ సంఘం తొలి ఆత్మీయ సమ్మేళనం

సేవా స్ఫూర్తి.. స్నేహబంధం.. ఐకమత్యమే లక్ష్యంగా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

మామిడి తోటలో ఆత్మీయంగా సాగిన కుటుంబాల సమ్మేళనం

ముఖ్యఅతిథిగా జలగం వీరస్వామి

నమస్తే భారత్ షాద్ నగర్,ఆగస్టు,17:
కొమ్ము మరియు అనుబంధ కుటుంబాల మధ్య స్నేహం, ఆత్మీయత, ఐకమత్యాన్ని మరింత బలోపేతం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచే లక్ష్యంతో కొమ్ము మరియు అనుబంధ కుటుంబాల సంక్షేమ సంఘం తొలి ఆత్మీయ సమ్మేళనం ఆదివారం మామిడి తోటలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కొమ్ము మరియు అనుబంధ కుటుంబాల పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై సమ్మేళనాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా కుటుంబాల మధ్య పరస్పర సహకారం, ఆప్యాయత, సేవాభావం, విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. కుటుంబాల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరూ ఒక కుటుంబంలా అండగా నిలవాలని, వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా సమాజ సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని పలువురు సూచించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ విద్యావేత్త, మహబూబాబాద్ జిల్లా మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జలగం వీరస్వామి హాజరై సుదీర్ఘమైన, సందేశాత్మక ఉపన్యాసాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక కుటుంబం బలంగా ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని, అనేక కుటుంబాలు ఐక్యంగా ముందుకు సాగితే బలమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. మన మధ్య ఉన్న చిన్నచిన్న భేదాలను పక్కనపెట్టి “సేవ, స్నేహం, ఐకమత్యం” అనే మూడు సూత్రాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సమాజంలోని పేద, బలహీన కుటుంబాలకు అండగా నిలవడం, విద్యార్థులను ప్రోత్సహించడం, యువతకు మార్గనిర్దేశం చేయడం, మహిళలకు గౌరవం మరియు సముచిత స్థానం కల్పించడం, అవసరమైన వారికి ఆపదలో సహాయం చేయడం వంటి కార్యక్రమాలను సంఘం చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. సంఘం కేవలం ఒక సంస్థగా కాకుండా ప్రతి కుటుంబానికి ఆత్మీయ బంధువుగా, ప్రతి సమస్యకు అండగా నిలిచే సేవా వేదికగా ఎదగాలని ఆయన సూచించారు.
ఈ ఆత్మీయ సమ్మేళనానికి మాజీ ఎంపీటీసీ కొమ్ము రాహుల్, కొమ్ము వెంకన్న, కొమ్ము యాకయ్య, కొమ్ము ఊశయ్య గారి సంజీవ, కొమ్ము నరసయ్యగారి సంజీవ తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు కొమ్ము మరియు అనుబంధ కుటుంబాల పెద్దలు, మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
సమ్మేళనంలో కొమ్ము మరియు అనుబంధ కుటుంబాల సంక్షేమ సంఘానికి నూతన కమిటీని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
– ప్రెసిడెంట్: కొమ్ము శ్రవణ్ కుమార్
– వర్కింగ్ ప్రెసిడెంట్: పెండెల లక్ష్మణ్
– కార్యదర్శి: పి. సురేష్
– ప్రచార కార్యదర్శి: పి. రవికుమార్
– కోశాధికారులు: కొమ్ము ముత్తయ్య గారి సంజీవ, పి. వేణు మాధవ్
కార్యవర్గ సభ్యులు గా
1. కే. నాగయ్య
2. కే. సునీల్
3. పి. శ్రీను
4. కే. నిఖిల్
5. కే. రామకృష్ణ
6. కే. రవి
7. పి. నవీన్
8. దుడెల్లి దిలీప్
9. ఎం.ప్రేమ్‌ కుమార్
సంఘం నూతన కమిటీకి మార్గనిర్దేశం చేసేందుకు ప్రముఖ విద్యావేత్త, విశ్రాంత ఉపాధ్యాయులు కొమ్ము డేవిడ్, తెలుగు పండిట్ జలగం వీరస్వామి, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు,బండ ఆశన్న, దాసరి నాగరాజు, పందులు సంజీవ,కొమ్ము సత్యం, కొమ్ము వీరాస్వామి, తదితరులను ముఖ్య సలహాదారులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంటామని తెలిపారు. సంఘం ద్వారా విద్య, వైద్యం, ఉపాధి, ఆర్థిక సహకారం, యువత అభివృద్ధి, మహిళా సాధికారత, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.నూతనంగా ఎన్నికైన కమిటీ అధ్యక్షుడు కొమ్ము శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, తమపై ఉంచిన బాధ్యతను గౌరవంగా స్వీకరిస్తున్నామని తెలిపారు. సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రతి కుటుంబానికి చేరువగా ఉండేలా పనిచేస్తామని ఆయన అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, యువతకు మార్గనిర్దేశం, మహిళల సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. అలాగే అవసరమైన ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.“మనమంతా ఒక్కటిగా ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు.. మన ఐకమత్యమే మన బలం.. మన సేవే మన గుర్తింపు” అనే స్ఫూర్తితో సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు.తొలి ఆత్మీయ సమ్మేళనం కుటుంబాల మధ్య స్నేహబంధాలను మరింత బలోపేతం చేస్తూ, భవిష్యత్ తరాలకు ఐకమత్యం, మానవత్వం, సేవా స్ఫూర్తికి ఆదర్శంగా నిలిచేలా ఘనంగా ముగిసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!