ePaper
Thursday, July 30, 2026
ePaper
Homeఎడిటోరియల్కుత్బుల్లాపూర్‌లో ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర అదనపు సీఈఓ కీలక ఆదేశాలు

కుత్బుల్లాపూర్‌లో ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర అదనపు సీఈఓ కీలక ఆదేశాలు

📰 Generate e-Paper Clip

కుత్బుల్లాపూర్‌లో ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర అదనపు సీఈఓ కీలక ఆదేశాలు

-తప్పులేని, పారదర్శక ఓటరు జాబితా రూపొందించడమే ప్రధాన లక్ష్యం

-డూప్లికేట్, నకిలీ, మరణించిన ఓటర్ల వివరాలపై ప్రత్యేక దృష్టి

-చిరునామా మార్పులు, అందుబాటులో లేని ఓటర్లను క్షేత్రస్థాయిలో ధృవీకరించాలి

-80 ఏళ్లు పైబడిన ఓటర్ల ప్రొజెనీ మ్యాపింగ్ వేగవంతం చేయాలని ఆదేశం

-పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలి

-వీవీఐపీ ఓటర్ల వివరాలు, డేటా డిజిటైజేషన్ పురోగతిపై సమీక్ష

-ఒకే ఇంటి వద్ద నమోదైన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచన

-అవకతవకలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

కుత్బుల్లాపూర్, జులై 27 ( నమస్తే భరత్ ); తెలంగాణ రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సహాయ ఎన్నికల నమోదు అధికారులతో (ఏఈఆర్వోలు) సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఓటరు జాబితా శుద్ధీకరణ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా సమీక్షించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో అందుబాటులో లేని ఓటర్లు, నివాసం లేదా చిరునామా మార్చుకున్న వారు, మరణించిన ఓటర్లు, డూప్లికేట్, నకిలీ ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పరిశీలించి ఖచ్చితమైన ధృవీకరణ చేపట్టాలని అదనపు సీఈఓ ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి నమోదును అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు./అదేవిధంగా 80 సంవత్సరాలు పైబడిన ఓటర్ల ప్రొజెనీ మ్యాపింగ్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, ఎన్నికల ప్రక్రియలకు సంబంధించిన అన్ని పనులను భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రమాణాల మేరకు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ముసాయిదా ఓటరు జాబితాలోని వీవీఐపీ ఓటర్ల వివరాలు, ఎన్యూమరేషన్ ఫారాల డేటా డిజిటైజేషన్ పురోగతిని కూడా ఆయన సమీక్షించారు. ప్రతి నమోదు ఖచ్చితత్వంతో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. ఒకే ఇంటి వద్ద అధిక సంఖ్యలో నమోదైన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలించి వాస్తవ పరిస్థితులను నిర్ధారించాలని సూచించారు. ఎలాంటి తప్పుడు నమోదు చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. “స్వచ్ఛమైన, పారదర్శకమైన, తప్పులేని ఓటరు జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం. ప్రతి అధికారి పూర్తి బాధ్యతతో పనిచేయాలి. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అవకతవకలు జరిగినా సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం” అని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో ఏఈఆర్వోలు శంకర్ సింగ్, వెంకట్రాములు, స్పందన, రాజేష్, వాణిరెడ్డి, ప్రమీల, ఉదయ్ కుమార్, వేణు, రమేష్, పవన్ కుమార్, ప్రవీణ్ కుమార్, నర్సింగ్ రావు, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!