సంక్షేమానికి పెద్దపీట.స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసిన సర్పంచ్ నాగ నాయక్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని వాల్యతండా.గ్రామపంచాయతీలో సర్పంచ్ నాగ నాయక్ ఆధ్వర్యంలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ నాగనాయక్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులను నిరంతర ప్రక్రియ గా మార్చి రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు మరింత సౌకర్యవంతంగా రేషన్ అందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిపిఓ పెద్దమనుషులు, స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు



