ePaper
Monday, August 31, 2026
ePaper
Homeతెలంగాణపాపన్నపేట బియ్యం గోదాంను శాసిస్తున్న కృష్ణ బాయ్*...* !

పాపన్నపేట బియ్యం గోదాంను శాసిస్తున్న కృష్ణ బాయ్*…* !

📰 Generate e-Paper Clip

*పాపన్నపేట బియ్యం గోదాంను శాసిస్తున్న కృష్ణ బాయ్*…* !

*అతడి ఆగడాలకు అడ్డే లేదు*….!!

 

*బాయ్ కనుసన్నల్లోనే గోదాం ఇంచార్జి*…!!!?

 

మెదక్, జిల్లా, పాపన్నపేట మండలం, ఆగస్టు, 29 (నమస్తే భారత్)

 

 

మండల కేంద్రమైన పాపన్నపేటలోని పౌరసరఫరాల గోదాం (ఏంఎల్ఎస్ పాయింట్) ఉంది.ఇక్కడి నుండి రెండు మండలాలకు అంటే పాపన్నపేట,టేక్మాల్ మండలాలకు చెందిన రేషన్ డీలర్లకు బియ్యం పంపిణీ చేసే అధికారం గోదాం ఇంచార్జికి ఉండగా,గోదాంలో స్టేజి -2 కాంట్రాక్టర్ కృష బాయ్ అన్ని తానే అయి అతను చెప్పిందే వేదం,చేసిందే శాసనం తరహాలో గోదాం ఇంచార్జినీ,హమాలీలను తన కనుసన్నల్లో, ఉంచుకుని డీలర్లకు బియ్యం పంపిణీ చేస్తున్నారని కొందరు రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలుపు, అంత్యోదయ అన్నయోజన రేషన్ కార్డులు కలిగి ఉన్నవారికి ఆగస్టు, సెప్టెంబర్,అక్టోబర్ మూడు నెలల బియ్యాన్ని ఈనెల 31వరకు కార్డు దారులు తీసుకోవాల్సినప్పటికీ క్రిష్ణ భాయ్ ఆడిందే ఆట… పాడిందే పాట…అన్నట్లుగా వ్యవహరించడంతో రేషన్ డీలర్లు గ్రామాలలో కార్డుదారులకు సమాధానం చెప్పలేక పోతున్నారు.లేదంటే డీలర్లకు బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. భాయ్ ఏరూటు చెబితే ఆరూట్ కే బియ్యం లోడ్ వెళ్లాలి, లేదంటే వాహనాలు నిలిచిపోవాల్సిందే…. ఈ తతంగమంతా గోదాం ఇంచార్జి నరసింహరావు కు తెలిసినప్పటికీ ఏమి చేయలేక మిన్నకుండిపోతున్నాడు.ఈ విషయంలో జిల్లా అధికారులు కల్పించుకుని సకాలంలో బియ్యం పంపిణీ చేయాలని రేషన్ కార్డు దారులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!