జర్నలిస్ట్ కాలనీ సమస్యలు పరిష్కరించాలి – కౌన్సిల్కు జర్నలిస్టుల వినతి
నమస్తే భారత్ :-మరిపెడ
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని అయ్యప్ప గుడి సమీపంలోనీ జర్నలిస్ట్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని మరిపెడ జర్నలిస్టులు కోరారు. గురువారం ఈ మేరకు మరిపెడ కౌన్సిల్ సమావేశంలో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ! మున్సిపల్ అధికారులు జర్నలిస్ట్ కాలనీలో మౌలిక వసతులు కల్పించడానికి సానుకూలంగా ఉన్నట్లు వారు తెలిపారు. జర్నలిస్టు కాలనీలో మౌలిక వసతులు లేకపోవడంతో ఇండ్లు.శిథిలావస్థకుచేరుతున్నాయన్నారు. అధికారులు స్పందించి తాగునీరు, సిసి రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ వినతి పత్రం అందజేసిన వారిలో మరిపెడ జర్నలిస్టులు ఎస్కే. సత్తార్ పాష బి. నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.



