వాచ్య తండాలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని బురాన్పురం గ్రామపంచాయతీ పరిధిలోని వాచ్ తండాలో బానోత్ బుజ్జి, కిరణ్ల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం గృహ యజమానులను అభినందిస్తూ, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మరిపెడ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి కేసముద్రం వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పెద్దబోయిన ఐలమల్లు బురాన్పురం గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల వెంకటమ్మ వెంకటయ్య కాంగ్రెస్ నాయకులు దశరథ్ నల్లు శ్రీకాంత్ రెడ్డి కొన్నే సోమన్న మహబూబాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జరుపుల విజయ్ మరిపెడ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భానోత్ నరేష్ కుమార్ గారు, మరిపెడ మండల కోఆర్డినేటర్ అక్కినపల్లి వెంకట్ సాయి తదితరులు పాల్గొన్నారు.



