తీవ్ర అనారోగ్యంతో ఉన్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎం.డి. అబ్దుల్ ఖాదర్ను పరామర్శించిన
యుటిఎఫ్ నాయకులు
నమస్తే భారత్ :-మరిపెడ
టీఎస్ యుటిఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు ఎం.డి. అబ్దుల్ అజీజ్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ తండ్రి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎం.డి. అబ్దుల్ ఖాదర్ తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న టీఎస్ యుటిఎఫ్ జిల్లా, మండల నాయకులు మంగళవారం ఆయన నివాసానికి.వెళ్లి.పరామర్శించారు.ఈ సందర్భంగా అబ్దుల్ ఖాదర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నాయకులు, ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.ఈ పరామర్శ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా నాయకులు ఎం. శివప్రసాద్, తుమ్మ వెంకటప్పయ్య, అమీన్, సత్యనారాయణ, రాములు, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



