గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ
ఖానాపురం జూన్ 17 (నమస్తే భారత్ ) :
ఖానాపురం మండల కేంద్రంలో యాదవ కుల బాంధవుల ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి సోనబోయిన స్వామి తన స్వంత స్థలంను వితరణ చేశాడు. అర్చకులు పర్వతపు శివప్రసాద్ శాస్త్రి వేద మంత్రాలతో భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. యాదవ కుల పెద్దమనిషి జక్కుల సాయిలు, యాదవ కుల సంఘం గౌరవ అధ్యక్షుడు నూనెల కుమార స్వామి, అధ్యక్షుడు తోటకూరి రాజు, ఉపాధ్యక్షుడు భూష బోయిన శ్రవణ్, మరియు గ్రామంలోని వివిధ కుల సంఘాల పెద్దమనుషులు కోయగూరి కుమారస్వామి, ఉప్పు రాజు, వీరమల్ల శ్రీను, రెడ్డి నాగార్జున రెడ్డి, మల్యాల పోశెట్టి, గ్రామ సర్పంచ్ దాసరి రమేష్, ఏ ఎం సి వైస్ చైర్మన్, శాఖమూరి హరిబాబు, ఆత్మ డివిజన్ చైర్మన్ యడ్ల బిక్షం రెడ్డి,మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మాజీ సర్పంచ్ పరుచూరి సుబ్బారావు, వార్డు సభ్యులు వేములపల్లి వెంకట ప్రసాద్ రావు, శాఖమూరి ముఖేష్ చౌదరి, మచ్చిక అశోక్ గౌడ్ యాదవ కుల బాంధవులు, సంఘ బాధ్యులు తోటకూరికుమారస్వామి ,జుర్రు యాకయ్య, తొట్ల సాంబయ్య, జటంగి పెద్ద కుమార్, జటంగి చిన్న కుమార్, భూష బోయిన నాగయ్య, వీరబోయిన ముత్యాలు, మారబోయిన రాజేందర్, చిన్నాల సారంగం, నూనెల కొమ్మాలు, వీరబోయిన గంగయ్య, రాజ బోయిన రాజు, లక్ష్మణ్, రఘు, భూష బోయిన అయిల్ మల్లు, స్వామి, సోనబోయిన వినీల్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

