రైతులు పప్పు ధాన్యల సాగును పెంచాలి
ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి
నమస్తే భారత్ :-చిన్నగూడూర్
రైతులు పప్పు ధాన్యాల సాగును అధికంగా పెంచాలని ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు
చిన్న గూడూరు మండలం ఉగ్గంపల్లి రైతు వేదికలో విత్తనమేళా ను సందర్శించిన ఆత్మ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి రైతులకు పెసర, కంది, మినుములు, వరి విత్తనాలనుపంపిణీ చేశారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పప్పు ధాన్యాల సాగు ఆందోళన స్థాయిలో తగ్గిన క్రమం లో రైతంగం పప్పు ధాన్యల సాగు చేసి స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చని అన్నారు
పంట మార్పిడి విధానాన్ని పాటించి, నానో యూరియా, డి ఏ పి ల వాడకాన్ని పెంచాలని కోరారు ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరి సన్నాలు మాత్రమే వేయాలని అన్నారు
యూరియా యాప్ తీసుకురావడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అజ్మీర భాస్కర్,ఏఈఓ శిరీష, రైతులు తదితరులు.పాల్గొన్నారు



