ఉపాధి పనులు కల్పించాలి.. 24 గంటల విద్యుత్ అందించాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య మండల నాయకులు బాణాల రాజన్న డిమాండ్
నమస్తే భారత్ :-మరిపెడ
వ్యవసాయ కార్మికులకు గ్రామీణ పేదలకు విబిజీ రాంజీ ఉపాధి హామీ పనులను వెంటనే కల్పించి వలసలు నివారించి పేదలను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య మండల నాయకులు బాణాల రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సెప్టెంబర్ 11న పురుషోత్తయగూడెం గ్రామ శాఖ సమావేశం పిట్టల పద్మ అధ్యక్షతన జరిగింది సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ వర్షాలు లేకపోవడంతో రైతాంగం వేసిన వివిధ రకాల పంటలు ఎండిపోతున్నాయని దీంతో వ్యవసాయ కార్మికులకు గ్రామీణ పేదలకు పనులు లేక వలస పోతున్నారని వెంటనే వివిజి రాంజీ ఉపాధి హామీ పనులు కల్పించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు కరెంటు కోతలతో రైతులు అవస్థలు పడుతున్నారని కరెంటు కోతలు నివారించి నాణ్యమైన 24 గంటల విద్యుత్తును సప్లై చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన పోరాటం నిర్వహిస్తామని వారన్నారు ఈ సమావేశంలో గ్రామ శాఖ సభ్యులు పిట్టల పద్మ కంచు గట్ల పిచ్చయ్య వల్లపు భద్రమ్మ అల్వాల విజయ అనసూయ యశోద అరుణ శ్రీలత తదితరులు పాల్గొన్నారు



