క్రాంతి నగర్ అభివృద్ధికి శ్రీకారం… రూ.2 కోట్ల పనులకు శంకుస్థాపన

-సీఎంసీ నిధులతో రోడ్లు, పార్కు అభివృద్ధి పనుల ప్రారంభం
-ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ ఇన్చార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి
-ప్రజలకు మెరుగైన మౌలిక వసతులే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
-కాలనీల సమగ్ర అభివృద్ధికి దశలవారీ కార్యాచరణ
-స్థానిక ప్రజల హర్షం.. అభివృద్ధి పనులకు ఘన స్వాగతం
-పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కాలనీ వాసులు
బాచుపల్లి, జూలై 23 ( నమస్తే భరత్ );బాచుపల్లి డివిజన్ పరిధిలోని క్రాంతి నగర్ కాలనీలో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. సీఎంసీ నిధులతో చేపడుతున్న రోడ్ల నిర్మాణం, సీసీ రోడ్లు, పార్కు అభివృద్ధి పనులను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి కాలనీ అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. క్రాంతి నగర్ కాలనీలో చేపట్టనున్న అభివృద్ధి పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా, పరిశుభ్రమైన వాతావరణం, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. కాలనీల అభివృద్ధి కోసం అవసరమైన ప్రతి పనిని దశలవారీగా పూర్తి చేసేందుకు తమ వంతు కృషి కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ వీరేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జీవన్ రెడ్డి, మురళి, నర్సింగరావు, కాలనీ ప్రతినిధులు బుగ్గ రెడ్డి, రాజసుర, నవీన్, వంశీ, శ్రీధర్, హరి, కృష్ణ, రఘు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభివృద్ధి పనులకు మద్దతు తెలిపారు. స్థానికులు ఈ పనుల ప్రారంభాన్ని స్వాగతిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు.



