బిజెపి ఎంపీ సుష్మిత వ్యాఖ్యలు అధికార దుర్వినియోగానికి నిదర్శనం
సిపిఐ (మం)మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ ఖండన
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్థానిక ప్రజా సంఘాల భవనంలో మధుసూదన్ మాట్లాడుతూ బిజెపి పార్లమెంటు సభ్యురాలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సుస్మిత దేవ్ , సిపిఐ(ఎం) కేరళం రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడు సిపిఐ(ఎం) రాజ్యసభ పక్షనేత కామ్రేడ్ జాన్ బ్రిట్టాస్ పై నిన్న మధ్యాహ్నం 2:00 కు నిండు సభలో రాజ్యసభ సాక్షిగా లుంగీవాలా అంటూ అర్థరహిత అహంకారపూరితమైన కామెంట్లు చేయడం ఇది బిజెపి అవకాశవాద వైఖరికి నిదర్శనమని, సిపిఎం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా ఇలా దక్షిణ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని అవమానిస్తూ, బిజెపి ప్రభుత్వ ఎంపీ తీవ్రంగా విమర్శించడం సౌత్ ఇండియా l ఎంపీలను అవమానించడం సరైన వైఖరి కాదు అని అభిప్రాయపడ్డారు, జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ, నేను మలయాలం అనీ దక్షిణ భారతదేశంలో పుట్టడం అది నాకు గొప్ప అని, అన్నాడు సుస్మిత చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్ కు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు ఇదే పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ కమ్యూనిస్టులు పిరికివాళ్లు అని సంబోధించడం ఇవన్నీ చూస్తా ఉంటే భవిష్యత్తులో బిజెపికి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టు పార్టీలే అని గమనించిన బిజెపి కమ్యూనిస్టులను పార్లమెంటులో, రాజ్యసభలో పదేపదే టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడడాన్ని తీవ్ర అసహనానికి గురి చేసిందని అన్నారు, తక్షణమే సుస్మిత నిర్మల సీతారామన్ ఇదే పార్లమెంటు, రాజ్యసభ సాక్షిగా, కమ్యూనిస్టు పార్టీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఆయన చేశారు



