తానంచర్ల జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
కేవీపీస్ మండల నాయకులు పోలె పాక గణేష్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల గ్రామపంచాయతీ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ, కె వి ఎస్ మండల నాయకులు పూలె పాక గణేష్ గ్రామలో సర్వే నిర్వహించడం జరిగింది, ఇందులో ముఖ్యంగా స్కూల్లో కంప్యూటర్ గదిని సపరేటుగా ఏర్పాటు చేయాలని, కంప్యూటర్ శిక్షణ త్వరితగతిన విద్యార్థిని విద్యార్థులకు ఇవ్వాలని, వాటిలో మైనర్ రిపేర్లు చేయించాలని, అదేవిధంగా స్కూల్లో బాయ్స్ విద్యార్థులకు టాయిలెట్స్ రూమ్ కి తలుపులు ( డోర్స్) ఏర్పాటు చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, అదేవిధంగా తానంచర్ల స్కూల్లో, ఒక సంవత్సరం ఉన్న విద్యార్థినీ విద్యార్థులు, మరొక సంవత్సరం వరకు వారి సంఖ్య క్రమంగా తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు, గ్రామంలో, వివిధ తండాలలో, మాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ హామీ చట్టం కింద, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాలని, పనికి వెళ్తున్న ప్రతి ఒక్కరికి కరెక్టు టైం లో డబ్బులు విడుదల చేయాలని, కొత్త వితంతు, ఒంటరి మహిళ, వృద్ధాప్య, వివిధ రకాల వృత్తిలూ అయినా గీత, మత్స్య కార్మిక, రజక, నాయి బ్రాహ్మణ, తదితర వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో, పోలే పాక గణేష్,స్కూల్లో.ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, కొమ్ము కరుణ గోపి, పగిలిన సత్యం తదితరులు పాల్గొన్నారు



