ePaper
Saturday, June 13, 2026
ePaper
Homeఎడిటోరియల్ఖమ్మం మైనర్ బాలిక ఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి

ఖమ్మం మైనర్ బాలిక ఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

*ఖమ్మం మైనర్ బాలిక ఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి*

*-ఖమ్మం జిల్లాలో 12 సంవత్సరాల రజక కులం,మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటన!*
*-నిందితుని కఠినంగా శిక్షించాలనీ డిమాండ్!*

*-హ్యూమన్ రైట్స్ ఫర్ ఇండియా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అయిల్ శ్రీశైలం గౌడ్*

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్11:ఖమ్మం మైనర్ బాలిక ఘటనపై రాజకీయ నాయకుల మౌనం ఎందుకు?హ్యూమన్ రైట్స్ ఫర్ ఇండియా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అయిల్ శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…మొన్న ఒక పోక్సో కేసు విషయంలో కొందరు రాజకీయ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు పెద్ద ఎత్తున స్పందించారు. అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో 12 సంవత్సరాల మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటన విషయంలో అదే స్థాయిలో స్పందన కనిపించకపోవడం ప్రశ్నలు లేవనెత్తుతోంది.ఒక చిన్నారి జీవితాన్ని నాశనం చేసే స్థాయిలో జరిగిన ఈ ఘటనపై రాజకీయ పార్టీలు, మహిళా నాయకులు,సామాజిక సంస్థలు మరియు ప్రజాప్రతినిధులు తమ వైఖరిని స్పష్టంగా చెప్పాలి. బాధితురాలు ఏ కులానికి చెందినదైనా, ఏ వర్గానికి చెందినదైనా, ఆమె ముందుగా మన సమాజంలోని ఒక ఆడబిడ్డ.తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మ వంటి మహనీయురాలి పోరాటాలను గౌరవంగా స్మరించుకునే వారు, నేడు ఒక చిన్నారి న్యాయం కోసం కూడా అదే స్థాయిలో గళం విప్పాలి.మహిళల హక్కులు, బాలికల భద్రత గురించి మాట్లాడే నాయకులు ఈ ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి.నేరస్థుడు ఎవరు అయినా, అతనికి రాజకీయ పార్టీ, హోదా లేదా ప్రభావం అడ్డుగా రాకూడదు. పోలీసులు వేగంగా చర్యలు తీసుకుని నిందితుడిని చట్టం ముందు నిలబెట్టాలి.అలాగే బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.బాలికలపై జరిగే నేరాల విషయంలో ఎంపిక చేసిన స్పందనలు కాకుండా,ప్రతి ఘటనపై ఒకే విధమైన న్యాయం మరియు ఒకే విధమైన ఖండన ఉండాలి.అప్పుడే సమాజం నిజమైన సమానత్వాన్ని విశ్వసిస్తుంది.”బాధితురాలు ఎవరి కూతురైనా సరే, న్యాయం ఒకటే కావాలి. రాజకీయాలు కాదు,బాధితురాలికి న్యాయం ముఖ్యం.మని ” హ్యూమన్ రైట్స్ ఫర్ ఇండియా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అయిల్ శ్రీశైలం గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!