ePaper
Sunday, August 9, 2026
ePaper
Homeఎడిటోరియల్పోచంపల్లి అభివృద్ధికి రూ. 82 లక్షల సి.ఎం.సి. నిధులు

పోచంపల్లి అభివృద్ధికి రూ. 82 లక్షల సి.ఎం.సి. నిధులు

📰 Generate e-Paper Clip

పోచంపల్లి అభివృద్ధికి రూ. 82 లక్షల సి.ఎం.సి. నిధులు


➤ రోడ్లు, మురుగునీటి సమస్యల పరిష్కారానికి శ్రీకారం

➤ కొలన్ హనుమంత్ రెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనుల ప్రారంభం

➤ సీసీ రోడ్లు, భూగర్భ మురుగునీటి కాలువల నిర్మాణానికి నిధుల కేటాయింపు

➤ ప్రతి గ్రామం – ప్రతి కాలనీ అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం

➤ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు

 

కుత్బుల్లాపూర్, ఆగస్టు 6 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్‌పల్లి 294వ డివిజన్ పరిధిలోని పోచంపల్లి గ్రామంలో ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రోడ్లు, మురుగునీటి పారుదల సమస్యల పరిష్కారానికి సి.ఎం.సి. నిధుల నుంచి రూ. 82 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హనుమంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు. మంజూరైన నిధుల్లో సురక్ష గ్రీన్ మెడోస్ రోడ్డు అభివృద్ధికి రూ. 20 లక్షలు, గాయత్రీ ఇండస్ట్రీస్-66 నుంచి హోలీ చైల్డ్ స్కూల్ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 15 లక్షలు, మేడ్చల్ రోడ్డు నుంచి గాయత్రీనగర్ కాలనీ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 32 లక్షలు, భూగర్భ మురుగునీటి కాలువ (యూ.జీ.డి.) పనులకు రూ. 15 లక్షలు కేటాయించారు. ఈ సందర్భంగా కొలన్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. డివిజన్‌లోని ప్రతి గ్రామం, ప్రతి కాలనీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ ప్రోటోకాల్ వైస్ చైర్మన్ బొంగునూరి కిశోర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మైసిగారి శ్రీనివాస్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ అమరం ముత్యం రెడ్డి, మాజీ సర్పంచ్ రామగౌడ్, కాంగ్రెస్ నాయకులు సుధాకర్ గౌడ్, తిరుపతి రెడ్డి, సదానంద్, కిషన్ రెడ్డి, ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!