జాతీయస్థాయి ఉష్షు పోటీలకు అనంతారo ఆదర్శ పాఠశాల విద్యార్థులు
నమస్తే భారత్ :-మహబూబాబాద్
స్థానిక జిల్లా కేంద్రంలోని అనంతారo శివారు ఆదర్శ పాఠశాల విద్యార్థులు
ఇటీవల ఆదివారం గద్వాల్ లో జరిగిన ఫస్ట్ సాందా ఉష్షు స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో అనంతారం ఆదర్శ పాఠశాల నుంచి 5 గురు విద్యార్థులు మహబూబాబాద్ జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని వివిధ పథకాలు సాధించి మణిపూర్ లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది అని ప్రిన్సిపల్ జి .ఉపేందర్ రావు తెలిపారు పథకాలు సాధించిన విద్యార్థులు
1.డి. రుతు( బంగారు పతకం)
70 కేజీల విభాగం. 2. జి. జాహ్నవి (రజిత పథకం)
48 కేజీల విభాగం. 3. పి. లాస్య (రజిత పథకం)
48 కేజీల విభాగం. 4. ఈ .పావని (రజిత పథకం).
45 కేజీల విభాగం. 5. వి. శాన్వి శ్రీ (కాంస్య పథకం)
48 కేజీల విభాగం
అదేవిధంగా పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి బి విష్ణు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో 1500 విభాగంలో ప్రథమ స్థానం సాధించి మెదక్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యాడు జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ జి.ఉపేందర్ రావు పిడి . వర్మ జిల్లా ఉష్షు అసోసియేషన్ సెక్రటరీ జావిద్ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.



