పెద్దన్న త్వరగా కోలుకోవాలని నాజీతండాలో ప్రత్యేక పూజలు
ఖానాపురం జులై28 ( నమస్తే భారత్ ) :
నర్సంపేట మాజీ శాసనసభ్యులు, ఉద్యమ నేత, ప్రజాసేవకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా వారు త్వరగా కోలుకోవాలని వారికి మా గ్రామ అభయాంజనేయ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, చికిత్స పూర్తయి సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని నాజీతండా పార్టీ ఆధ్వర్యంలో ఖానాపురం మండలం నాజీతండాలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాజీతండా గ్రామ సర్పంచ్ బాదావత్ జ్యోతి బాలకిషన్ నాయక్, ఖానాపూర్ మండల యూత్ అధ్యక్షులు బానోతు శ్రీనివాస్ నాయక్, గ్రామ పార్టీ నాయకులు బానోత్ కిరు ,భూక్యా కిషన్,బానోతు తేజు, నున్సావత్ బాలకిషన్ ,భూక్యా వాగ్య,శంకర్ ,రమేష్ , భుక్య రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.



