మరణించిన కుటుంబానికి ఆర్థిక సహకారం అందించిన
సర్పంచ్.అజ్మీర రవి
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబబాద్ జిల్లా మరిపెడ మండలం అజ్మీరా తండ గ్రామపంచాయతీకి చెందిన అజ్మీర శీను s/o బళ్ళు అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబానికి అండగా నిలబడి తక్షణమే అంత్యక్రియల కోసం 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వారి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా కల్పించారు. అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని బెనిఫిట్ లు ఏది ఉన్నా సరే తప్పకుండా చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.



