ePaper
Friday, September 18, 2026
ePaper
Homeఎడిటోరియల్పోషకాహారంతోనే కిషోర బాలికలకు సంపూర్ణ ఆరోగ్యం

పోషకాహారంతోనే కిషోర బాలికలకు సంపూర్ణ ఆరోగ్యం

📰 Generate e-Paper Clip

పోషకాహారంతోనే కిషోర బాలికలకు సంపూర్ణ ఆరోగ్యం

నమస్తే భారత్ :-తొర్రూరు

కిశోర బాలికలు పోషకాహారం తీసుకోవాలని ఏసిడిపిఓ విజయలక్ష్మి అన్నారు.
పోషణ మాసం సందర్భంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బుధవారం తొర్రూరు డివిజన్ పరిధిలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో పోషకాహార ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.రక్తహీనత, పోషకాహారం,బాలికల భద్రత, ఐసిడిఎస్ సేవలపై నెల్లికుదురు సెక్టార్ సూపర్వైజర్ నార్లపురం సరిత అవగాహన కల్పించారు.
ఏసిడిపిఓ మాట్లాడుతూ…
రక్తహీనత రాకుండా కిషోర బాలికలు ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం తీసుకోవాలని తెలిపారు. పోషకాలతో కూడిన ఆహారం, పరిశుభ్రత, ఆరోగ్యకర జీవనశైలి.పెంపొందించుకోవాలని కోరారు. రోజువారి మెనూలో గుడ్లు, ఆకుకూరలు,పాలు, చిరుధాన్యాలు,పండ్లు భాగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుమలత, అంగన్వాడి టీచర్ పద్మ, సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!