రిటైర్డ్ ఉపాధ్యాయుడు అబ్దుల్ ఖాదర్ కు ఘన నివాళి
సిపిఐ (ఎం) మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్థానిక బండ్ల కేంద్రంలోని రిటైర్డ్ ఉపాధ్యాయుడు అబ్దుల్ ఖాదర్ కి సిపిఎం మండల ప్రతినిధి బృందం ఘన నివాళులు అర్పించడం జరిగిందని సిపిఐ ఎం మండల కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు, ఖాదర్ 2006న అబ్బాయిపాలెం ప్రాథమిక పాఠశాలలో, పదవి విరమణ పొందాలని అదేవిధంగా ఆయనకు ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు అబ్దుల్ అజీజ్ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు, ప్రస్తుతం ఈయన డోర్నకల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు, చిన్న కుమారుడు అబ్దుల్ రషీద్, భారత కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు, అదే విధంగా ఖాదర్ కి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు, ఖాదర్ ఉపాధ్యాయ వృత్తిలో అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు విద్యను బోధించి ఎంతో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారని కొనియాడారు అతడు ఉపాధ్యాయుడుగా ఉన్నప్పుడు ఎంతో శ్రద్ధతో పాఠశాలకు వెళ్లేవారని అదేవిధంగా బాధ్యతతో ఉపాధ్యాయ వృత్తిని చేశారని గుర్తు చేశారు అలాంటి వ్యక్తి ఈరోజు మనతో లేకపోవడం వారి కుటుంబానికే కాక సమాజాన్ని కూడా ఎంతో తీరని లోటు అని మధు వివరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు బాణాల రాజన్న కందాల రమేష్ తాటికొండ అనంత చారి, వే టు న్యూస్ విలేకర్ సత్తార్ భాష వీరారం శాఖ సత్యం, దొంతు మమత తదితరులు పాల్గొన్నారు



