సర్పంచ్ పై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

*మాగనూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వడ్వాట్ గ్రామ సర్పంచ్ జి. రవీందర్*,
నమస్తే భరత్,,, 27/6/2026/ నారాయణపేట జిల్లా
మాగనూర్ మండలంలోని నేరుగడం దొడ్డి గ్రామ పంచాయతీలో మొహర్రం వేడుకల్లో రాజకీయ ప్రత్యర్థులు, దుండగులు ఉద్దేశ పూర్వకంగా సర్పంచ్ వెంకటేష్ తో గొడవ పెట్టుకొని కత్తులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుగా వచ్చిన సర్పంచ్ వర్గీయులను కూడా దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించి! చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల తెలంగాణ రాష్ట్ర సర్పంచులు అందరం కలిసి ఉద్యమిస్తామని మాగనూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వడ్వాట్ గ్రామ సర్పంచ్ జి. రవీందర్ తెలియజేశారు.



