శంషాబాద్ జోన్ 119 డివిజన్ యూత్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన సాయి కిరణ్ గౌడ్ .
నమస్తే భారత్ రాజేంద్రనగర్ ప్రతినిధి జూన్ 07
శంషాబాద్ జోన్ 119 డివిజన్ యూత్ జనరల్ సెక్రటరీ గా సాయి కిరణ్ గౌడ్ (పెట్రోల్ సాయి) నియమితులయ్యారు. భారత రాష్ట్ర సమితి రాజేంద్రనగర్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి చేతుల మీదుగా సాయి కిరణ్ గౌడ్ నియామక పత్రాన్ని అందుకున్నారు. సందర్భంగా సాయి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కొనమల్ల శ్రీనివాస్, చిన్న గండు రాజేందర్, బుచ్చిరెడ్డి, హనుమంతు ముదిరాజ్, వెంకట్ రెడ్డి,రమేష్ రాథోడ్, రమేష్ రాచమల్ల, జీవీపీ సాగర్, శ్రీకాంత్, రజనీకాంత్ రాచమల్ల కార్తీక్,మల్లేష్ మంచాల,మంచర్ల కిట్టు, శేఖర్ రోవన్ మణికంఠ పాల్గొన్నారు.


