ePaper
Friday, September 11, 2026
ePaper
Homeఎడిటోరియల్మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

📰 Generate e-Paper Clip

మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

నమస్తే భారత్ :-తొర్రూరు

పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని స్థానిక ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శారదా దేవి అన్నారు. మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టించాలని కోరుతూ స్థానిక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.
పిఓపి విగ్రహాలు కరిగేందుకు సుదీర్ఘ సమయం పడుతుందని, మట్టి విగ్రహాలు సులువుగా కరుగుతాయని తెలిపారు. చెరువుల్లో జలచరాలను, పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయకులని పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విమలాదేవి, ఎస్కే దర్గా హుస్సేన్, రేణుక రోజా మౌనిక, మమత, పల్లవి, సమ్మక్క, సంధ్య, సిఆర్పి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!