*ఏడుపాయల లో ఘనంగా పల్లకి సేవ*
మెదక్ జిల్లా,పాపన్నపేట మండలం ఆగస్టు 27, (నమస్తే భరత్)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాత కు పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం ఘనంగా పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్స్చవ విగ్రహాన్ని పల్లకిలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి నామస్మరణ ల మద్య బాజా భజంత్రీలతో ఊరేగింపుగా ఆలయ మంటపం నుండి రాజగోపురం శివాలయం ముందు నుండీ ఆలయం వరకు ఊరేగించి ఆలయం వరకు తీసుకెళ్ళారు. ఈ కార్యక్రమం లో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస శర్మ, యాదగిరి, రవి, మహేష్, వరుణాచారి, బత్తిని రాజు, నర్సింలు, నరేష్ తోపాటు భక్తులు పాల్గొన్నారు



