మూడో వార్డులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం
నమస్తే భారత్ :-మరిపెడ
డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు డా. జాటోత్ రామచంద్ర నాయక్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను మూడో వార్డులో పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా బి.ఎల్.ఓ ఉమా, బి.ఎల్.ఏ బయ్య లింగన్న, మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు జనక శ్రీను, వార్డు కమిటీ సభ్యులు జినుక ఉదయ్, అనంతగిరి రవి తదితరులు ఓటర్ సవరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ, కొత్త ఓటర్ల నమోదు, పేర్లు మరియు చిరునామాల్లో తప్పుల సవరణ, అవసరమైన మార్పులు, చేర్పులపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఓటు.ఎంతో.విలువైనది.అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని మూడో వార్డు నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



