ePaper
Sunday, August 9, 2026
ePaper
Homeఎడిటోరియల్ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై అధికారుల సమీక్ష సమావేశం

ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై అధికారుల సమీక్ష సమావేశం

📰 Generate e-Paper Clip

ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై అధికారుల సమీక్ష సమావేశం

➤ జీడిమెట్ల సర్కిల్‌లో బూత్ స్థాయి అధికారులకు ప్రత్యేక అవగాహన

➤ దరఖాస్తుల నవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచన

➤ ప్రతి ఓటరు వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశం

➤ క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచన

➤ బూత్ స్థాయి ప్రతినిధులతో సమన్వయానికి ప్రాధాన్యం

➤ ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు

 

కుత్బుల్లాపూర్, ఆగస్టు 7 (నమస్తే భరత్); కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జీడిమెట్ల సర్కిల్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బూత్ స్థాయి అధికారులకు, వారి పర్యవేక్షకులకు, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ప్రతినిధులకు ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, దరఖాస్తుల పరిశీలన, వివరాల నవీకరణ తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జీడిమెట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్, సహాయ ఎన్నికల నమోదు అధికారి డి. శంకర్ సింగ్ మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తప్పులు, డూప్లికేట్ నమోదులు, చిరునామా మార్పులు వంటి అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా విధులు నిర్వహించాలని తెలిపారు. జీడిమెట్ల సర్కిల్ సహాయ మున్సిపల్ కమిషనర్, సహాయ ఎన్నికల నమోదు అధికారి పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎన్నికల సూపరింటెండెంట్ ఆర్. గిరిబాబు, మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, బూత్ స్థాయి అధికారుల పర్యవేక్షకులు, బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!