నామాపూర్ ప్రాథమిక పాఠశాలకు పర్నిచర్ సామాగ్రి బహుకరణ
ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ మన్నే ఉపేందర్
మెదక్ జిల్లాపాపన్నపేట, మండలం సెప్టెంబర్ 10:(నమస్తే భారత్)
మండల కేంద్రమైన నామాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలకు అమెరికాలో నివసించే ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ మన్నే ఉపేందర్ గురువారం ఫర్నిచర్ మరియు ఎలక్ట్రానిక్ సామాగ్రి అయినటువంటి ప్రింటర్, సౌండ్ బాక్స్ ,ప్రొజెక్టర్ అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ , పాఠశాల చైర్మన్,ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్,గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. పాఠశాలకు అదనపు తరగతి గది నిర్మించి, వస్తువులు కూడా అందించిన శాస్త్రవేత్త గారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.



