సిద్ధార్థ హై స్కూల్ లో గోరింటాకు సంబరాలు
నమస్తే భారత్ :-తొర్రూరు
స్థానిక సిద్ధార్థ హై స్కూల్ లో గోరింటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు.
మహిళా ఉపాధ్యాయులు, ఒక్కచోట చేరి గోరింటాకు రుబ్బి ఒకరి చేతికి ఒకరు పెట్టుకుని మురిసిపోయారు.
ఆరోగ్యం, ఆచారం కలగలిపిన గోరింటాకు వేడుకల్లో బాలికలు, మహిళా ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పాటలు పాడుతూ సందడిగా గడిపారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ ముత్తినేని సోమేశ్వరరావు, కరస్పాండెంట్ ముత్తినేని జయప్రకాష్ లు మాట్లాడుతూ.ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు సంబరాలను అత్యంత ఉత్సాహంగా, వేడుకలా జరుపుకుంటారని, ఇది కేవలం అందం మాత్రమే కాకుండా ఆరోగయానికి, సాంప్రదాయానికి ప్రతీక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు.పాల్గొన్నారు.



