ePaper
Saturday, August 1, 2026
ePaper
Homeఎడిటోరియల్వర్షాకాల సమస్యలపై అప్రమత్తం.. జీడిమెట్లలో ప్రత్యేక మాన్సూన్ కంట్రోల్ రూమ్

వర్షాకాల సమస్యలపై అప్రమత్తం.. జీడిమెట్లలో ప్రత్యేక మాన్సూన్ కంట్రోల్ రూమ్

📰 Generate e-Paper Clip

వర్షాకాల సమస్యలపై అప్రమత్తం.. జీడిమెట్లలో ప్రత్యేక మాన్సూన్ కంట్రోల్ రూమ్

-జీడిమెట్ల సర్కల్-55లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు

-ప్రజల ఫిర్యాదులకు 24 గంటల సేవలు అందుబాటులోకి

-వర్షాల సమయంలో అత్యవసర సమస్యల పరిష్కారానికి చర్యలు

-ఫిర్యాదుల కోసం 040-23090024 హెల్ప్‌లైన్ నంబర్ విడుదల

-క్షేత్రస్థాయిలో అధికారుల సమన్వయంతో వేగవంతమైన స్పందన

-ప్రజలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ విజ్ఞప్తి

 

కుత్బుల్లాపూర్, జులై 30 ( నమస్తే భరత్ ): వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ సేవలు అందించేందుకు జీడిమెట్ల సర్కల్-55 పరిధిలో ప్రత్యేక మాన్సూన్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. వర్షాల కారణంగా నీటి నిల్వలు, డ్రైనేజీ పొంగిపొర్లడం, చెట్లు విరిగిపడటం, రోడ్లపై నీరు నిలవడం, ఇతర అత్యవసర పరిస్థితులపై వెంటనే స్పందించేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని తెలిపారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలను వెంటనే సంబంధిత విభాగాలకు చేరవేసి, వేగంగా పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. జీడిమెట్ల సర్కల్-55 పరిధిలోని ప్రజలు వర్షాకాలానికి సంబంధించిన అత్యవసర సమస్యలు ఎదురైనప్పుడు 040-23090024 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అందిన ప్రతి ఫిర్యాదుపై అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని తెలిపారు. వర్షాకాలంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. ప్రజలు కూడా అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ సేవలను వినియోగించుకుని సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!