NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 11:44 am Posted by : NAMASTHE BHARAT

బీజేపీ నాయకులకు యువమోర్చా శుభాకాంక్షలు

బీజేపీ నాయకులకు యువమోర్చా శుభాకాంక్షలు

-రాంచందర్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన బీజేవైఎం నేతలు

-నూతన బాధ్యతలు చేపట్టిన శేఖర్ యాదవ్, రాష్ట్ర మీడియా కన్వీనర్‌కు అభినందనలు

-పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్ష

-పాల్గొన్న రాష్ట్ర, జిల్లా స్థాయి యువమోర్చా నాయకులు

కుత్బుల్లాపూర్, జూలై 2 నమస్తే భరత్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయవంతంగా ఒక సంవత్సరం పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న రాంచందర్ రావును బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే నేతృత్వంలో బీజేవైఎం రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ నాగదీప్ గౌడ్, నాయకులు రావుల పృథ్వి, కార్తీక్ యాదవ్‌తో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి యువమోర్చా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన నాయకత్వం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం భారతీయ జనతా పార్టీ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా (అర్బన్) ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన శ్రీ శేఖర్ యాదవ్‌ను, అలాగే బీజేవైఎం రాష్ట్ర మీడియా కన్వీనర్‌గా నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి సమర్థవంతమైన నాయకత్వంలో జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ మరింత బలోపేతం కావడంతో పాటు యువతను ప్రజా సేవా కార్యక్రమాల్లో మరింత చైతన్యవంతం చేస్తూ విజయవంతమైన కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు పాల్గొని నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులకు తమ మద్దతు తెలిపారు.