NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 4:52 pm Posted by : NAMASTHE BHARAT

నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి

నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి

నమస్తే భారత్ :-తొర్రూరు

నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కన్న బ్రదర్స్ జక్కా మహబూబ్ రెడ్డి,జక్కా ఇంద్రసేనారెడ్డి లు అన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు మండలంలోని
వెంకటాపురం గ్రామానికి చెందిన గుండాల సోమ నర్సమ్మ, జన్నపురెడ్డి రంగారెడ్డి లు ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాలను సందర్శించి పరామర్శించి మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు.అర్పించారు.అనంతరం ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల చొప్పున 50 కేజీల బియ్యం,రూ.3 వేల చొప్పున రూ.6 వేలు నగదును అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని,ఝాన్సీ రెడ్డి సహకారంతో నిరుపేద బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున వచ్చే సంక్షేపతకాలు సకాలంలో అదే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం గ్రామ సర్పంచ్ ధరావత్ విజయ రవి, ఉప సర్పంచ్ మొగుళ్ల లింగన్న గౌడ్, నాయకులు రావుల వెంకటరెడ్డి, వెన్నెం సోమిరెడ్డి, బొలగాని శ్రీనివాస్,వీరన్న గౌడ్,వల్లంల వెంకటేశ్వర్లు, నకరికంటి సంపత్, మహంకాళి సంపత్, ఎర్రం రాజు యాదవ్, పరుశురాం తదితరులు పాల్గొన్నారు