NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 8:33 pm Posted by : NAMASTHE BHARAT

జీడిమెట్లలో దొంగల బీభత్సం.. షాపులో చోరీ

జీడిమెట్లలో దొంగల బీభత్సం.. షాపులో చోరీ
-షాపు షట్టర్ పగులగొట్టి రూ.30 వేల నగదు, సిగరెట్ బాక్సులు చోరీ

-జీడిమెట్లలోని దయాల్ ట్రేడర్స్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్

-షాపు షట్టర్ తెరిచి నగదు, గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ బాక్సులు ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తుల

-ఉదయం షాపు తెరవడానికి వచ్చిన యజమానికి వెలుగులోకి ఘటన

-సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు

-జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు

-దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాపారుల విజ్ఞప్తి

కుత్బుల్లాపూర్, జూలై 1 ( నమస్తే భరత్ ): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని హెచ్ఎంటీ సొసైటీ, షాపూర్‌నగర్ ప్రాంతంలో ఉన్న దయాల్ ట్రేడర్స్ కిరాణా షాపు లో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. షాపు షట్టర్‌ను పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు రూ.30 వేల నగదుతో పాటు గోల్డ్ ఫ్లేక్ బిగ్ రెండు బాక్సులు, గోల్డ్ ఫ్లేక్ స్మాల్ రెండు బాక్సులు అపహరించారు. షాపు యజమాని ఎం. రామ్ తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 30 రాత్రి సుమారు 10 గంటలకు షాపును మూసివేసి ఇంటికి వెళ్లగా, జూలై 1 ఉదయం సుమారు 5.30 గంటలకు పరిచయస్తుడి నుంచి ఫోన్ రావడంతో అక్కడికి చేరుకున్నారు. షాపు షట్టర్ తెరిచి ఉండటం గమనించి లోపల పరిశీలించగా నగదు, సిగరెట్ బాక్సులు కనిపించలేదు. ఈ ఘటనపై వెంటనే జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ దొంగలను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ మేరకు బాధితుడు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాంతంలో వరుస చోరీలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రాత్రి వేళల్లో పోలీసు గస్తీని మరింత కట్టుదిట్టం చేయాలని స్థానిక వ్యాపారులు కోరుతున్నారు.