NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 6:52 pm Posted by : NAMASTHE BHARAT

లక్ష్మా తండ జిపి లో కరెంట్ సమస్య పరిష్కారం చేయాలి

లక్ష్మా తండ జిపి లో కరెంట్ సమస్య పరిష్కారం చేయాలి
తెలంగాణ గిరిజన సంఘం
జిల్లా నాయకులు కిషన్ నాయక్

నమస్తే భారత్ :-మరిపెడ

తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగింది
ఈ సర్వేలో సమస్యలు పరిష్కారం చేయాలని గిరిజన సంఘం జిల్లా నాయకులు కిషన్ నాయక్ అన్నారు
తండాలో కరెంటు సమస్య చాలా విపరీతంగా ఉందని రాత్రి సమయంలో కరెంట్ తీసేస్తున్నారని, వ్యవసాయ బావులకు కరెంట్ కటింగ్ చేస్తున్నారని, నూతనంగా నిర్మిస్తున్న పంచాయితీ కార్యాలయానికి కరెంట్ సౌకర్యం కల్పించాలని, తండాల్లో ఉన్న స్మశాన వాటికకు కరెంట్ సౌకర్యం ఇవ్వాలని, మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేయాలని గిరిజన సంఘం సర్వేలో ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, కిషన్ నాయక్ అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో, గిరిజన సంఘం నాయకులు జగష్,మాలసూర్, మోహన్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు