నెల రోజులుగా వెలగని వీధి దీపాల.భయాందోళనలో కాలనీవాసులు!
నెల రోజులుగా వెలగని వీధి దీపాల.భయాందోళనలో కాలనీవాసులు! నమస్తే భారత్:-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని మూడో వార్డులో గత నెల రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో కాలనీ మొత్తం చీకటిమయంగా మారడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.చీకటి కారణంగా కాలనీలో పాములు, తేళ్లు, ఇతర విషపూరిత పురుగులు సంచరిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు రాత్రి సమయంలో బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.గత నెల...