NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 9:23 pm Posted by : NAMASTHE BHARAT

ఎమ్మెల్యే దొంతిని మర్యాద పూర్వకంగా కలిసిన  సోసైటి పాలకవర్గం

ఎమ్మెల్యే దొంతిని
మర్యాద పూర్వకంగా కలిసిన సోసైటి పాలకవర్గం

ఖానాపురం జూలై9 ( నమస్తే భారత్ ) :
వరంగల్ జిల్లా ఖానాపురం మండల సోసైటీకి నూతనంగా నియామకమైన పాలకమండలి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని గురువారం మర్యాద పూర్వకంగా కలిసి పూలబొకె అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. సోసైటీ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వ పథకాలు మంజూరి చేసి సహాయ సహాకారాలు అందించాలని ఎమ్మెల్యేను ఈసందర్భంగా సోసైటీ పాలకవర్గం విజ్ఞప్తి చేసింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ వైస్ ఛైర్మన్ శాఖమూరి హరిబాబు , సోసైటీ చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ , డైరెక్టర్లు బండి వెంకన్న ,లింగిడి వెంకటేశ్వర్లు, దేవినేని వేణుగోపాలరావు , బొబ్బ విద్యాసాగర్ రావు , శివరాత్రి వెంకన్న ,బాల్గు లక్ష్మణ్ ,ఎర్ర రజిత ,భాష బోయిన రవి ,మర్రి ప్రభాకర్ , జటంగి నాగరాజు ,చెడుపాక రజిత ,నునావత్ బిచ్చ , ఆత్మ చైర్మన్ ఎడ్ల బిక్షం రెడ్డి , మండల పార్టీ నాయకులు సర్పంచులు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.