NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 2:41 pm Posted by : NAMASTHE BHARAT

ఎమ్మెల్యే దొంతిని సన్మానించిన సోసైటీ ఛైర్మన్ లు

ఎమ్మెల్యే దొంతిని సన్మానించిన సోసైటీ ఛైర్మన్ లు

నర్సంపేట జులై28 (నమస్తే భారత్) :

నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవ రెడ్డి ని నర్సంపేటనియోజకవర్గంలోని సోసైటీ చైర్మెన్ లు మర్యాద పూర్వకంగా కలిసి శాలువలు కప్పి సన్మానం చేశారు. సోసైటీ చైర్మన్ లుగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అడుగుజాడల్లో నడుచుకుంటూ తమ గురుతర బాధ్యతను నెరవేరుస్తామన్నారు.రైతు శ్రేయస్సు కోసం పాటుపడుతామన్నారు.
ఈ కార్యక్రమంలో మందపల్లి చైర్మెన్ తోకల శ్రీనివాస్ రెడ్డి ,ఖానాపురం సొసైటీ చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ ,నర్సంపేట చైర్మెన్ బొబ్బల రమణారెడ్డి , చెన్నారావు పేట చైర్మెన్ భూక్యా గోపాల్ నాయక్ , నాచినపల్లి చైర్మెన్ చెన్నూరి కిరణ్ రెడ్డి , నెక్కొండ చైర్మెన్ శ్రీపాల్ రెడ్డి , నల్లబెల్లి చైర్మెన్ రఘుపతి రావు ,సాయిరెడ్డి పల్లి చైర్మెన్ ఆవుల శ్రీనివాస్ , గురిజాల చైర్మెన్ ప్రసాద్ ,సూరిపల్లి ఛైర్మన్ మదాటి శ్రీను ,దుగ్గొండి చైర్మెన్ కుమారస్వామి , అమీనాబాద్ చైర్మెన్ మొగిలి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.