NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 4:14 pm Posted by : NAMASTHE BHARAT

సర్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలి

సర్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలి

నమస్తే భారత్ :-తొర్రూరు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్ ప్రక్రియ మండలంతో పాటు,పట్టణంలో సక్రమంగా జరిగే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి, పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్ లు అన్నారు.ఆదివారం పట్టణ కేంద్రంలోని మండల,పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ సర్ సర్వే దరఖాస్తులు ప్రతి అర్హులైన ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రతి ఓటరు తప్పనిసరిగా దరఖాస్తు ఫారాలను నింపి బిఎల్ఓలకు అందజేయాలన్నారు.ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తొర్రూరు పట్టణ మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్,జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బొమ్మనబోయిన వెంకన్న యాదవ్,మార్కెట్ డైరెక్టర్.కంచర్ల.వెంకటాచారి,గుండాల నరసయ్య, యూత్ అధ్యక్షుడు బసనబోయిన మహేష్ యాదవ్,బసనబోయిన రాజేష్, నల్లపు రాజు,జిలకర సురేందర్, తాళ్ళపెల్లి బిక్షం, తూర్పటి రాంబాబు, చట్ల చంటి, మర్కా రుద్రయ్య,భూతం భారత్,బిజ్జల అశోక్,చిదిరాల రవి,చింతల సందీప్,పనికర రమేష్, జాటోత్ రమేష్, కసోజు రాజేష్, భూక్యా హేమంత్,బానోతు ప్రవీణ్ నాయక్,జలకం నవీన్,కందుకూరి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.