NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 9:33 pm Posted by : NAMASTHE BHARAT

సెప్టెంబర్ 17విమోచనము కానె కాదు బుద్ధుల జంగయ్య చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు

సెప్టెంబర్ 17విమోచనము కానె కాదు బుద్ధుల జంగయ్య

చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు

నమస్తే భారత్ షాద్ నగర్, సెప్టెంబర్17:ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభకు బుద్ధుల జంగయ్య ఆధ్వర్యంలో బయలుదేరిన సిపిఐ శ్రేణులు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య మాట్లాడుతూ తెలంగాణ లో జమీందారులకు జాకీర్దాలకు వ్యతిరేకంగా చిన్న కారు చిన్న కారు కౌలు రైతులు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో చేసిన పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని ఆయన వివరించారు రావి నారాయణరెడ్డి బద్దం ఎల్లారెడ్డి మగ్గం మొయినాదీన్ షేక్ బందగి నూరు ఖాన్ పుచ్చలపల్లి సుందరయ్య తదితరులు అనేకులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నవారు ఆ పోరాటంలో అనేక రకమైన ప్రజాసంఘాల నాయకులు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు 4500 మందిఆసువులు బాచారు ఆ పోరాట ఫలితంగానే జాగిర్దాలు జమీందారులు గ్రామాలను వదిలేసి పట్టణ బాట పట్టిన పరిస్థితి 3000 గ్రామాలకు విముక్తి చేసి పది లక్షల ఎకరాలను పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ
సిపిఐదని ఆయన తెలియజేశారు
సర్దార్ వల్లభాయ్ పటేల్ హోం మంత్రిగా ఉన్నప్పుడు భారత సైన్యంతో తెలంగాణపై దండేఎత్తి వచ్చి తెలంగాణ నవాబు సైన్యంపై పోరాటం చేయలేదు కమ్యూనిస్టు సాయి దళాలు విమిక్తు చేసిన గ్రామాలకు రక్షణగా ఉంటే వారిపై పోరాటం చేసి వారిని కాల్చి చంపి తిరిగి జాగిందాలకు జమీందారులకు గ్రామాల్లో ఉన్న భూములన్ని అప్పజెప్పడం జరిగింది అధికారాలను అప్పజెప్పడం జరిగింది తెలంగాణ నవాబును రాజభరణాలతో పాటు గవర్నర్ పదవి ఇచ్చి లోపై కారి ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది అని తెలిపారు చరిత్ర చెరిగిపోదు చరిత్ర పుటల్లో నిలిచిపోయే చరిత్ర తెలంగాణ ది భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే రుజువు ఇలాంటి చరిత్ర కలిగిన సెప్టెంబర్ 17ను విమోచనమని వీలీనమని అనేక రకమైన పుక్కిటి పురాణాలు రచించి చరిత్రను వక్రీకరిస్తున్న మతోన్మాద నాయకులు పార్టీలు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలనిఆయన ఇతవు పలికారు నేటి సమాజంలో తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర తెలంగాణ యువతరానికి తెలియాల్సిన అవసరం ఉందని దాన్ని పాటాంశాలలో కూడా చేర్చాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ కొందుర్గు మండల కార్యదర్శి భాగాళ నరసింహ జిల్లేడు చౌదరిగుట్ట మండల సహాయ కార్యదర్శి
ఎం డి షబ్బీర్ నాయకులు ఈదమ్మ జంగయ్య
జి యాదయ్య శ్రీను సి సురేష్ బి యాదయ్య పామిడి జగ్గయ్యతదితరులు పాల్గొన్నారు.