స్కూల్ పిల్లలతో కలిసి మొక్కలు నాటిన సర్పంచ్ దాసరి రమేష్
ఖానాపురం ఆగష్టు25(నమస్తే భారత్ ) :
వన మహోత్సవంలో భాగంగా సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో, ప్రధాన రహదారి వెంబడి మొక్కలు నాటారు. మొక్కల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. చిన్నతనం నుండే పిల్లలలో మొక్కల పట్ల ప్రేమను పెంపొందించుకోవాలన్నారుచెట్టును నాటి దానిని కాపాడితే అది మనకు ప్రాణవాయువును ఇస్తుందని అన్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకొని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏపీవో సునీత ఉపసర్పంచ్ ఉప్పు రాజు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.